ప్రజల సొమ్ము దోచుకుంటున్న Mahesh Babu రెస్టారెంట్

సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ పక్క సినిమాలు చేస్తునే మరో పక్క పలు వ్యాపారాలు నడిపిస్తున్నాడు.

Update: 2022-12-08 14:41 GMT

దిశ, సినిమా: సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ పక్క సినిమాలు చేస్తునే మరో పక్క పలు వ్యాపారాలు నడిపిస్తున్నాడు. కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌లో ఆసియన్ గ్రూప్‌తో కలిసి గచ్చిబౌలి‌లో 'AMB సినిమాస్' నిర్మించారు మహేష్. ఈ మల్టీప్లెక్స్‌కు హైదరాబాద్‌లో ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఇక రీసెంట్‌గా అదే ఆసియన్ గ్రూప్‌తో కలిసి సూపర్ స్టార్ 'ఆసియన్ నమ్రత రెస్టారెంట్' అని హైదరాబాద్‌లో ప్రారంభించాడు. అక్కడ లోకల్ నుంచి నాన్ లోకల్ వంటకాలన్నీ ఉంటాయటా.

అసలు కథ ఏమిటంటే.. ఈ రెస్టారెంట్‌లో ఉన్న ఐటమ్స్ రేట్స్ చూస్తుంటే సామాన్యులు ఈ రెస్టారెంట్‌లోకి అడుగు కూడా పెట్టరు. మామూలుగా మనం బయట ఒక ప్లేట్ పునుగులు తింటే మహా అయితే ఒక రూ. 10 లేదా రూ. 20 ఉంటుంది. కానీ, మహేష్ రెస్టారెంట్‌లో ప్లేట్ పునుగులు రూ.125 రూపాయలు. ఇక మసాలా దోశ రూ.190, రవ్వ దోశ రూ.190, పూరి రూ.170 ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. ప్లేట్ ఇడ్లీ ధర రూ. 90. అయితే ఈ ధరలను చూసిన నెటిజన్లు.. ప్రజల సొమ్మును ఇలా దోచుకుంటున్నారని నెట్టింట విమర్శలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

Sonakshi Sinha ప్రియుడితో తిరుగుతున్న Rhea Chakraborty.. షాక్‌లో సుశాంత్ ఫ్యాన్స్ 

Tags:    

Similar News