సుధీర్, శ్రీను, ఆదిల గురించి సంచలన నిజాలు చెప్పిన అదిరే అభి.. అలా కోట్ల ఆస్తులు సంపాదించారంటూ కామెంట్స్!

జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతో మంది స్టార్ రేంజ్‌కు ఎదిగిపోయారు. ముఖ్యంగా సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, హైపర్ ఆది, బుల్లెట్ భాస్కర్, రోహిణి, చమ్మక్ చంద్ర, అదిరే అభి వీరు మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు. అయితే ఇప్పుడు

Update: 2024-05-14 03:23 GMT

దిశ, సినిమా : జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతో మంది స్టార్ రేంజ్‌కు ఎదిగిపోయారు. ముఖ్యంగా సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, హైపర్ ఆది, బుల్లెట్ భాస్కర్, రోహిణి, చమ్మక్ చంద్ర, అదిరే అభి వీరు మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు. అయితే ఇప్పుడు వీరు స్టార్ హీరోల సినిమాలో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అంతే కాకుండా హీరోగా చేస్తూ కూడా తమ లక్కును పరీక్షించుకుంటున్నారు. అయితే వీరికి సంబంధించిన ఏదో ఒక రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. తాజాగా జబర్దస్త్ కమెడీయన్స్ పై అదిరే అభి షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రస్తుతం ఆది, సుధీర్, శ్రీను మంచి ఫామ్‌లో ఉన్నారు. వరసగా ఆఫర్స్ చేస్తూ చాలా బిజీ అయిపోయారంటూ చెప్పుకొచ్చారు. అయితే వీరు జబర్దస్త్ వలన ఫైనాన్షియల్‌‌గా బాగా సెటిల్ అయినట్లు రూమర్స్ వినిపించాయి. కానీ అవన్నీ నిజాలు కాదు. జబర్దస్త్ వలన కోట్ల ఆస్తులు సంపాదించారు అనడంలో వాస్తవం లేదు. అసలు ఆ షో ద్వారా వచ్చే ఇన్ కమ్ చాలా తక్కువ. కానీ జబర్ధస్త్ వల్ల మంచి ఫేమ్ మాత్రం సంపాదించుకోగలిగాము.

చాలా మంది కమెడియన్స్ మార్నింగ్ మొత్తం ప్రైవేట్ ఈవెంట్స్ చేసి రాత్రిళ్లు మేలుకొని జబర్ధస్త్ షోలో పాల్గొనే వారు. చాలా వరకు ప్రైవేట్ షోల వల్లనే ఎక్కువ ఆదాయం వచ్చేది. కమెడియన్స్ బయట షోస్ చేయడం వల్లనే ఎక్కువ డబ్బు సంపాదించారు. జబర్దస్త్ ద్వారా కోట్ల ఆదాయం వస్తే ఇప్పటికీ కొంత మంది మెడికల్ ఖర్చుల కోసం ఇబ్బంది పడుతూ ఉండరు కదా అంటూ తెలిపారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.


Similar News