సినిమా కోసం ఉపవాసం ఉన్న హీరోయిన్.. షాక్‌లో డైరెక్టర్, హీరో!

‘ఈ మాయ పేరేమిటో’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ కావ్య థాపర్.

Update: 2024-10-08 11:14 GMT

దిశ, సినిమా: ‘ఈ మాయ పేరేమిటో’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ కావ్య థాపర్. తర్వాత ‘ఏక్ మినీ కథ, ఊరు పేరు భైరవకోన, డబుల్ ఇస్మార్ట్’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను పలకరించింది. ఈ బ్యూటీ ఇప్పుడు మాచో స్టార్ గోపీచంద్ ‘విశ్వం’తో ప్రేక్షకుల ముందు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వేణు దోనేపూడి చిత్రాలయం స్టూడియోస్‌పై టిజి విశ్వప్రసాద్ నిర్మింస్తుండగా.. దోనేపూడి చక్రపాణి సమర్పిస్తున్నారు. ఈ చిత్రం నుంచి రీసెంట్‌గా రిలీజైన టీజర్‌కు, అలాగే ఫస్ట్ సింగిల్‌కు సోషల్ మీడియాలో విశేష స్పందన లభించింది. భారీ అంచనాల మధ్య ‘విశ్వం’ మూవీ ఈ దసరా కానుకగా అక్టోబర్ 11న రిలీజ్ కాబోతుంది. దీంతో ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు చిత్ర బృందం. ఈ సందర్భంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కావ్య థాపర్.. ‘విశ్వం’ సినిమాపై ఆశక్తికర కామెంట్స్ చేసింది.

‘నేను మన కల్చర్స్‌ను బాగా ఫాలో అవుతాను. నవరాత్రికి మన సంసృతిలో ఏం చేస్తారో అవన్నీ చేస్తాను. ఉపవాసం కూడా ఉంటాను. విశ్వం సినిమాకు మంచి విజయం రావాలని మొదటి సారి నవరాత్రి తొమ్మిది రోజులు ఉపవాసం ఉంటున్నాను. కేవలం సాత్వికాహారం లాంటిది తీసుకుంటాను’ అని తెలిపింది. దీంతో ఇంటర్వ్యూలో ఉన్న గోపీచంద్, శ్రీను వైట్ల సైతం ఆశ్చర్యపోయారు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా.. సినిమా కోసం కావ్య థాపర్ ఉపవాసం ఉందని తెలుసుకున్న నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.


Similar News