గ్రాండ్‌గా నందమూరి సినీ స్వర్ణోత్సవ వేడుకలు.. విజయవంతంగా 50 ఏళ్లు పూర్తి!

ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు అగ్ర హీరో బాలకృష్ణ.

Update: 2024-09-02 06:01 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు అగ్ర హీరో బాలకృష్ణ. ఈ హీరో సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టి నేటితో 50 వసంతాలు పూర్తయ్యింది. ఈ సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమ బాలయ్య స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించింది. నిన్న(సెప్టెంబరు1) హైదరాబాద్ నోవాటెల్ హోటల్ లో గ్రాండ్ గా జరిగిన ఈ కార్యక్రమానికి నందమూరి కుటుంబం హాజరైంది. వీరితో పాటుగా పలువురు ప్రముఖ సినీ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. సినీ పరిశ్రమలోని యంగ్ హీరోల నుంచి అగ్రతారల వరకు ఈ స్వర్ణోత్సవ వేడుకలకు హాజరై తెగ సందడి చేశారు. వెంకటేష్, కమల్ హాసన్, చిరంజీవి, రాఘవేంద్రరావు, నాని, మంచు మనోజ్, మోహన్ బాబు, రానా, మురళీమోహన్‌, విజయేంద్ర ప్రసాద్‌, విష్ణు, మాలశ్రీ, అశ్వినీదత్‌, సుహాసిని, మైత్రీ మూవీమేకర్స్‌ నిర్మాతలు, నవీన్‌, బోయపాటి శ్రీను, విశ్వక్ సేన్, పి.వాసు, జయసుధ కుటుంబంతో సహా బాలకృష్ణ హాజరై ఈ వేడుకలో తెగ సందడి చేశారు. ఈ సందర్భంగా సినీ ఇండస్ట్రీని నటీనటుల టాలెంట్ గురించి మాట్లాడారు. 


Similar News