Committee Kurrollu: ఆ సీన్స్ కన్నీళ్లు పెట్టిస్తాయి.. మెగా డాటర్ నిహారిక సినిమాపై డైరెక్టర్ కామెంట్స్

నూతన నటీనటులతో నిహారిక కొణిదెల నిర్మించిన చిత్రం 'కమిటీ కుర్రోళ్లు'.

Update: 2024-08-07 15:08 GMT

దిశ, సినిమా: నూతన నటీనటులతో నిహారిక కొణిదెల నిర్మించిన చిత్రం 'కమిటీ కుర్రోళ్లు'. యదు వంశీ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా దర్శకుడు యదు వంశీ మీడియాతో సినిమా విశేషాలను పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ 'మా ఊళ్లో జరిగే జాతరను ప్రేరణ తీసుకుని ఈ కథను రాసుకున్నాను. ప్రతి కుర్రాడు కథ ఇందులో కనిపిస్తుంది. నా నిజ జీవితంలో జరిగిన ఘటనలు కూడా ఈ చిత్రంలో యాడ్‌ చేశాను. మూవీ చూసిన ప్రతి ఒక్కరికి ఇందులో సన్నివేశాలు కనెక్ట్‌ అవుతాయి. నిహారికకు ఈ కథ నచ్చడంతో సినిమా సెట్స్‌ మీదకు వెళ్లింది. డా.జయప్రకాష్‌ నారాయణ, పవన్‌కళ్యాణ్‌ల స్పీచ్‌లు విని ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు రాసుకున్నాను. అవి హైలైట్‌గా ఉంటాయి. ఇందులో మదర్ సెంటిమెంట్ అందరినీ కదిలిస్తుంది.

థియేటర్లో ఆ సీన్ చూస్తే కంట్లోంచి నీళ్లు వస్తాయి. మన ఊరు.. మన కుర్రోళ్లు.. మన ప్రేమ.. మన భావోద్వేగాలు.. అన్ని అంశాలను వినోదాత్మకంగా చూపించాం. థియేటర్లో చూడాల్సిన సినిమా ఇది. థియేటర్లో కూర్చుంటో నిజంగా జాతరలో ఉండి సినిమాను చూసినట్టుగా అనిపిస్తుంది. కథ మీద నమ్మకంతోనే కథకు కావాల్సిన విధంగా కొత్త ఆర్టిస్టులను ఎంపిక చేసుకున్నాను. సినిమా చూసి అగ్ర హీరో చిరంజీవి, యువ కథానాయకుడు వరుణ్ తేజ్ అభినందించడంతో మా సినిమా విజయంపై మరింత నమ్మకం పెరిగింది. నెక్ట్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో కథను రాసుకుంటున్నాను. అందరూ భయపడేలా ఈ కథ ఉంటుంది. ఈ మూవీ పెద్ద హిట్ అయితే.. నేను అనుకున్న హీరోతోనే ఆ సినిమా చేస్తాను' అన్నారు.

Tags:    

Similar News