Bigg Boss Telugu 8- మూడో వారం నామినేషన్స్‌లో ఉన్న టాప్ కంటెస్టెంట్స్ వీరే!

నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న తెలుగు బిగ్‌బాస్ సీజన్-8 అట్టహాసంగా సాగుతోంది.

Update: 2024-09-17 02:13 GMT

దిశ, వెబ్‌డెస్క్: నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న తెలుగు బిగ్‌బాస్ సీజన్-8 అట్టహాసంగా సాగుతోంది. రాత్రి 7 కాగానే జనాలు టీవీలకు ముఖాలు పెట్టి బిగ్‌బాస్ వీక్షిస్తున్నారు. మంచి రేటింగ్‌తో దూసుకుపోతుంది. ఇటీవలే నాగార్జున కూడా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుందంటూ ఈ సంతోషాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇకపోతే హౌస్‌లోకి 14 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇవ్వగా.. మొదటి వారం నామినేషన్స్‌లో బెజవాడ బేబక్క హౌస్ వీడి ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. నిన్న జరిగిన నామినేషన్లలో శేఖర్ బాషా నామినేట్ అయ్యారు. బయటికొచ్చాక కావాలనే నేనే హౌస్ వీడానని గర్వంగా చెప్పుకొచ్చాడు. ఇక శేఖర్ బాషాకు రీసెంట్‌గా పండంటి మగబిడ్డ పుట్టిన విషయం తెలిసిందే.

ఇక బిగ్‌బాస్ మూడో వారం స్టార్ట్ అయిపోయింది. చూస్తూ చూస్తుండగానే 14 రోజులు గడిచిపోయాయి. మూడో వారానికి సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియ కూడా ముగిసింది. ఇందులో ఒక్కో కంటెస్టెంట్ ఇద్దరిని నామినేట్ చేసి..ఎందుకు నామినేట్ చేస్తున్నామో చెప్పి వారి తలపై చెత్త పోయాలి. అలా కిర్రాక్ సీత ఫస్ట్ యష్మిని నామినేట్ చేస్తుంది. విష్ణు ప్రియ.. ప్రేరణ, యష్మిని, పక్షపాత ధోరణి చూపించిందని పృథ్వీ కూడా యష్మిని నామినేట్ చేశాడు. మణికంఠ.. యష్మి, పృథ్విని నామినేట్ చేశాడు. కిర్రాక్ సీతని, విష్ణుప్రియని ప్రేరణ నామినేట్ చేసి తలపై చెత్త పోస్తుంది.

నిఖిల్-అభయ్ చీఫ్స్ గా ఉన్నారు. కాగా వీరిని నామినేట్ చేయడానికి వీలు లేదని బిగ్ బాస్ తెలిపాడు. మళ్లీ ట్విస్ట్ ఇద్దరిలో ఒకరు తప్పకుండా నామినేషన్స్ లో రావాలని అన్నాడు. దీంతో అభయ్ నామినేషన్స్‌లోకి వచ్చేందుకు అంగీకరించాడు. కాగా మూడో వారం టాప్ నామినేషన్స్‌లో అభయ్, మణికంఠ, పృథ్విరాజ్, నైనిక, విష్ణుప్రియ, సీత, యష్మి, ప్రేరణ, నామినేట్ అయినట్లు బిగ్ బాస్ వెల్లడించాడు. 


Similar News