టీమిండియా స్టార్ క్రికెటర్తో ఎఫైర్.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
స్టార్ హీరోయిన్ అనన్య పాండే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
దిశ, వెబ్డెస్క్: స్టార్ హీరోయిన్ అనన్య పాండే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ బ్యూటీ ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి మెప్పించింది. అలాగే తెలుగులో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ సరసన ‘లైగర్’ మూవీలో నటించింది. కానీ ఆ సినిమా భారీ డిజాస్టర్ కావడంతో ఈ అమ్మడు బాలీవుడ్ చెక్కేసింది. ప్రజెంట్ అడపా దడపా సినిమాలు చేస్తూ హీరోయిన్గా రాణిస్తోంది.
ఇదిలా ఉంటే.. గత కొన్ని నెలలుగా అనన్య పాండే వార్తల్లో నిలుస్తోంది. దానికి కారణం అనన్య పాండే స్టార్ క్రికెటర్ శుభమన్ గిల్తో ఎఫైర్ ఉండటం. అయితే అనన్య పాండే, శుభ్మన్ గిల్ కలిసి కొన్ని రోజుల క్రితం ఒక ప్రకటన చేశారు. దీంతో అప్పటి నుంచే వీరిద్దరు ప్రేమలో ఉన్నారని నెట్టింట ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ అనన్య పాండే ఆసక్తికర విషయాన్ని బయట పెట్టింది. 'విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఒక యాడ్ షూట్ సమయంలో మొదటిసారి కలుసుకున్నారు. ఆ తర్వాత ప్రేమలో పడ్డారు. విరాట్, అనుష్క లాంటి బంధం మీకూ శుభ్మన్కూ ఉందా?' అన్న ప్రశ్నకు స్పందించిన అనన్య.. 'బేసిక్ గా మేం చాలా డిఫరెంట్. నాకు, శుభ్మన్కు ఎప్పటికీ సంబంధం లేదు. యాడ్ ప్రమోషన్ కోసమే కలిశాం. ఆ తర్వాత మా మధ్య ఎలాంటి మాటలు కూడా లేవు’ అని చెప్పి షాక్ ఇచ్చింది. దీంతో ఈ పుకార్లకు బ్రేక్ పడిపోయింది.