దిగజారి మాట్లాడటం షబ్బీర్ అలీకి తగదు.. గంప గోవర్ధన్ ఆగ్రహం

దిశ, కామారెడ్డి: వరిధాన్యం కొనుగోలు చేయాలని, రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు కనీస మద్దతు ధర కల్పించాలని టీఆర్‌ఎస్ ఎంపీలు కేంద్ర ప్రభుత్వంపై ఉద్యమం చేస్తుంటే, డ్రామాలు అనడం షబ్బీర్ అలీ దిగజారుడు తనానికి నిదర్శనమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గంప గోవర్ధన్ విమర్శించారు. మాచారెడ్డి మండలం ఘన్‌పూర్ సర్పంచ్ భర్త రాజేందర్ మృతిచెందడంతో శుక్రవారం వారి కుటుంబాన్ని ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పరామర్శించారు. అనంతరం షబ్బీర్ అలీ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ఈ సందర్భంగా […]

Update: 2021-12-10 05:26 GMT

దిశ, కామారెడ్డి: వరిధాన్యం కొనుగోలు చేయాలని, రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు కనీస మద్దతు ధర కల్పించాలని టీఆర్‌ఎస్ ఎంపీలు కేంద్ర ప్రభుత్వంపై ఉద్యమం చేస్తుంటే, డ్రామాలు అనడం షబ్బీర్ అలీ దిగజారుడు తనానికి నిదర్శనమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గంప గోవర్ధన్ విమర్శించారు. మాచారెడ్డి మండలం ఘన్‌పూర్ సర్పంచ్ భర్త రాజేందర్ మృతిచెందడంతో శుక్రవారం వారి కుటుంబాన్ని ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పరామర్శించారు. అనంతరం షబ్బీర్ అలీ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతుల కోసం పార్లమెంట్‌లో ఆందోళన చేస్తోన్న ఎంపీలను విమర్శించడం మాజీ మంత్రి షబ్బీర్ అలీకి తగదన్నారు. టీఆర్ఎస్ ఎంపీలను దద్దమ్మలు అనడం ఆయన స్థాయిని దిగజార్చుకోవడమే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాది పాటు ఢిల్లీలో జరిగిన ఉద్యమంలో చనిపోయిన రైతు కుటుంబాలకు రూ.3 లక్షల పరిహారం ఇవ్వడాన్ని కూడా రాజకీయం చేశారని మండిపడ్డారు.

Tags:    

Similar News