బ్రేకింగ్.. మిస్ ఇండియాకు కరోనా.. మిస్ వరల్డ్ ఫైనల్ వాయిదా.. తెలుగు అమ్మాయికి నిరాశ

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా కారణంగా మిస్ వరల్డ్ ఫైనల్ వాయిదా పడింది. ప్యూర్టో రికోలోని శాన్ జువాన్, కోకాకోలా మ్యూజిక్ హాల్‌లో 2021కు గాను మిస్ వరల్డ్ ఫైనల్ పోటీ డిసెంబర్ 17(శుక్రవారం)న జరగాల్సి ఉంది . కానీ, కరోనా వ్యాప్తి కారణంగా ఈ పోటీలను వాయిదా వేస్తున్నట్టు నిర్వాహకులు శుక్రవారం వెల్లడించారు. ఈ పోటీల్లో కంటెస్టెంట్లతో పాటు సిబ్బంది(17 మంది)కి కరోనా సోకడంతో ఫైనల్‌ను వాయిదా వేస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. కరోనా బారినపడిన వారిలో […]

Update: 2021-12-16 22:00 GMT

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా కారణంగా మిస్ వరల్డ్ ఫైనల్ వాయిదా పడింది. ప్యూర్టో రికోలోని శాన్ జువాన్, కోకాకోలా మ్యూజిక్ హాల్‌లో 2021కు గాను మిస్ వరల్డ్ ఫైనల్ పోటీ డిసెంబర్ 17(శుక్రవారం)న జరగాల్సి ఉంది . కానీ, కరోనా వ్యాప్తి కారణంగా ఈ పోటీలను వాయిదా వేస్తున్నట్టు నిర్వాహకులు శుక్రవారం వెల్లడించారు.

ఈ పోటీల్లో కంటెస్టెంట్లతో పాటు సిబ్బంది(17 మంది)కి కరోనా సోకడంతో ఫైనల్‌ను వాయిదా వేస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. కరోనా బారినపడిన వారిలో మిస్ ఇండియా, హైదరాబాద్‌కు చెందిన మానస వారణాసి కూడా ఉండటం గమనార్హం. ఈ పోటీల్లో భారత్ తరఫున మానన వారణాసి ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలో మిస్ ఇండియా 2020 కిరీటాన్ని కైవసం చేసుకున్న మానస.. మిస్ వరల్డ్ పోటీలకు రెడీ అయింది. కరోనా కారణంగా పోటీ వాయిదా పడటంతో ఆమెకు నిరాశే ఎదురైంది.

 

Tags:    

Similar News