ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యం : ఎర్రబెల్లి

దిశ, వెబ్‌డెస్క్: అన్ని వృత్తి, వ్యాపారాలలో, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యం అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సోమవారం ఆయన వరంగల్ కలెక్టరేట్‌లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… శ్యామ్ ప్రసాద్ జాతీయ మిషన్ పథకం ద్వారా మండలంలోని గ్రామాల్లో పలు శాఖల ద్వారా విభిన్నమైన అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టనున్నామని తెలిపారు. అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనల తయారీ పూర్తి అయ్యిందన్నారు. […]

Update: 2020-10-12 01:49 GMT

దిశ, వెబ్‌డెస్క్: అన్ని వృత్తి, వ్యాపారాలలో, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యం అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సోమవారం ఆయన వరంగల్ కలెక్టరేట్‌లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… శ్యామ్ ప్రసాద్ జాతీయ మిషన్ పథకం ద్వారా మండలంలోని గ్రామాల్లో పలు శాఖల ద్వారా విభిన్నమైన అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టనున్నామని తెలిపారు. అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనల తయారీ పూర్తి అయ్యిందన్నారు. మరో రెండు లేదా మూడు రోజుల్లో టెండర్లను పిలుస్తామన్నారు. పర్వతగిరిని ఆదర్శ మండలంగా తీర్చి దిద్దుతామని మంత్రి స్పష్టం చేశారు.

Tags:    

Similar News