మహేష్ బాబుతో రొమాన్స్ చేయనున్న ఖిలాడి లేడీ..

దిశ,సినిమా: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా మరో బిగ్ ప్రాజెక్ట్ తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. కాగా ఇందులో పూజా హెగ్డే మెయిన్ హీరోయిన్ కాగా.. సెంకండ్ హీరోయిన్‌ పాత్రకు మీనాక్షీ చౌదరి ఎంపికైనట్టు సమాచారం. ప్రస్తుతం మాస్ మహరాజ్ రవితేజ, రమేశ్ వర్మ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘ఖిలాడి’ మూవీలో ఓ హీరోయిన్‌గా నటిస్తోన్న మీనాక్షి.. ఇప్పుడు మహేశ్ సరసన నటించే లక్కీ చాన్స్ కొట్టేసింది. కాగా ప్రస్తుతం మహేష్ బాబు […]

Update: 2021-10-22 04:57 GMT

దిశ,సినిమా: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా మరో బిగ్ ప్రాజెక్ట్ తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. కాగా ఇందులో పూజా హెగ్డే మెయిన్ హీరోయిన్ కాగా.. సెంకండ్ హీరోయిన్‌ పాత్రకు మీనాక్షీ చౌదరి ఎంపికైనట్టు సమాచారం. ప్రస్తుతం మాస్ మహరాజ్ రవితేజ, రమేశ్ వర్మ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘ఖిలాడి’ మూవీలో ఓ హీరోయిన్‌గా నటిస్తోన్న మీనాక్షి.. ఇప్పుడు మహేశ్ సరసన నటించే లక్కీ చాన్స్ కొట్టేసింది. కాగా ప్రస్తుతం మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తుండగా.. కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటిస్తున్న సినిమాకు ఎస్.ఎస్.థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న ఆర్ధిక కుంభకోణాల నేపథ్యంలో కథ సాగనుందని, 2022 సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ మూవీ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు.

Tags:    

Similar News