ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. ఇందులో 15 మందికి స్థాన చలనం జరిగింది. వైద్యశాఖ ఏపీ ఎంఎస్‌ఐడీసీ ఎండీగా తూర్పుగోదావరి కలెక్టర్ మురళీధర్‌రెడ్డి, కడప జిల్లా కలెక్టర్‌గా విజయరామరాజు, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌గా సీహెచ్‌. హరికిరణ్‌, ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవోగా వినయ్‌చంద్‌, విశాఖ జిల్లా కలెక్టర్‌గా ఎ.మల్లికార్జున, కమిషనర్‌ ఆర్‌అండ్ఆర్‌గా హరిజవహర్‌లాల్‌, విజయనగరం జిల్లా కలెక్టర్‌గా ఎ.సూర్యకుమారికి పోస్టింగ్‌ ఇచ్చారు. అంతేకాకుండా పౌరసరఫరాలశాఖ వీసీ, ఎండీగా జి.వీరపాండియన్‌, కర్నూలు జిల్లా కలెక్టర్‌గా […]

Update: 2021-07-23 20:29 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. ఇందులో 15 మందికి స్థాన చలనం జరిగింది. వైద్యశాఖ ఏపీ ఎంఎస్‌ఐడీసీ ఎండీగా తూర్పుగోదావరి కలెక్టర్ మురళీధర్‌రెడ్డి, కడప జిల్లా కలెక్టర్‌గా విజయరామరాజు, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌గా సీహెచ్‌. హరికిరణ్‌, ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవోగా వినయ్‌చంద్‌, విశాఖ జిల్లా కలెక్టర్‌గా ఎ.మల్లికార్జున, కమిషనర్‌ ఆర్‌అండ్ఆర్‌గా హరిజవహర్‌లాల్‌, విజయనగరం జిల్లా కలెక్టర్‌గా ఎ.సూర్యకుమారికి పోస్టింగ్‌ ఇచ్చారు.

అంతేకాకుండా పౌరసరఫరాలశాఖ వీసీ, ఎండీగా జి.వీరపాండియన్‌, కర్నూలు జిల్లా కలెక్టర్‌గా పి.కోటేశ్వరరావుకు పోస్టింగ్‌, వీఎంఆర్‌డీఏ మెట్రోపాలిటన్‌ కమిషనర్‌గా కె.వెంకటరమణారెడ్డి, పశ్చిమ గోదావరి జిల్లా జేసీగా సుమిత్‌కుమార్‌, శాప్ మేనేజింగ్ డైరెక్టర్, వైస్ చైర్మన్ గా ప్రభాకర్ రెడ్డి, (రైతుభరోసా కేంద్రం)శ్రీకాకుళం జేసీగా బి.ఆర్‌.అంబేడ్కర్‌, చేనేత శాఖ సంచాలకుడిగా పి.అర్జున్‌రావు, దేవదాయశాఖ ముఖ్య కార్యదర్శి వాణీమోహన్‌కు కమిషనర్‌గాను అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు.

Tags:    

Similar News