భార్యపై అనుమానం.. అక్కడ కొరికి పరారైన భర్త

దిశ, వెబ్‌డెస్క్: భార్యభర్తలన్నాక గొడవలు సహజం.. కానీ గొడవలే జీవితంగా సాగితే ఆ కాపురం ఎన్నటికీ నిలబడదు. మద్యానికి బానిసైన భర్తతో కాపురం చేయడం అంటే ఎంతటి నరకమో అనుభవించిన వారికే తెలుస్తోంది. మద్యం మత్తులో వారు ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా అఘాయిత్యాలకు పాల్పడినవారిని ఎంతోమందిని చూస్తూనే ఉన్నాం. తాజాగా భార్య కాపురానికి రాలేదని మద్యం మత్తులో ఉన్న ఓ భర్త ఆమె ముక్కును కొరికిన ఘటన కర్ణాటకలో వెలుగు చూసింది. వివరాలలోకి వెళితే  ఢార్వాడ్ […]

Update: 2021-07-11 06:40 GMT

దిశ, వెబ్‌డెస్క్: భార్యభర్తలన్నాక గొడవలు సహజం.. కానీ గొడవలే జీవితంగా సాగితే ఆ కాపురం ఎన్నటికీ నిలబడదు. మద్యానికి బానిసైన భర్తతో కాపురం చేయడం అంటే ఎంతటి నరకమో అనుభవించిన వారికే తెలుస్తోంది. మద్యం మత్తులో వారు ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా అఘాయిత్యాలకు పాల్పడినవారిని ఎంతోమందిని చూస్తూనే ఉన్నాం. తాజాగా భార్య కాపురానికి రాలేదని మద్యం మత్తులో ఉన్న ఓ భర్త ఆమె ముక్కును కొరికిన ఘటన కర్ణాటకలో వెలుగు చూసింది.

వివరాలలోకి వెళితే ఢార్వాడ్ సమీపంలోని అమ్మినబావి గ్రామానికి చెందిన ఉమేష్(40) కి కొన్నేళ్ల క్రితం గీత(35)తో వివాహమైంది. పెళ్ళైన కొన్ని రోజులు కాపురం సజావుగా నడిచతర్వాత కలహాలు మొదలయ్యాయి. మద్యానికి బానిసైన ఉమేష్ రోజు మద్యం తాగి వచ్చి భార్యను హింసించేవాడు. ఇక భర్త వేధింపులు తట్టుకోలేని భార్య తన పుట్టింటికి వెళ్ళిపోయింది. ఎన్ని రోజులైనా తిరిగి రాకపోయేసరికి భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఇటీవల భార్య దగ్గరికి వెళ్లిన ఉమేష్ అక్కడ పంచాయితీ పెట్టి భార్యను వేధించడం మొదలు పెట్టాడు.

తాను కాపురానికి వెళ్లనని, తన భర్త తనను వేధిస్తున్నాడని గీత చెప్పడంతో అత్తారింట్లోనే ఉంటున్నాడు ఉమేష్. ఈ నేపథ్యంలోనే శనివారం భార్యాభర్తల మధ్య వివాదం చోటుచేసుకుంది. అప్పటికే ఫుల్ గా మద్యం సేవించిన ఉమేష్ భార్యపై గొడవకు దిగాడు. నిత్యం మద్యం తాగుతూ.. గొడవ చేస్తున్న నీ వద్దకు వచ్చే ప్రసక్తే లేదని అతని భార్య తెగేసి చెప్పడంతో కోపోద్రిక్తుడైన ఉమేష్ భార్య ముక్కును కొరికి పరారయ్యాడు. ముక్కునుంచి రక్తం కారుతున్న ఆమెను హుబ్లీలోని కిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న ఉమేష్ కోసం గాలింపు చర్యలు చేపట్టాడు.

Tags:    

Similar News