కీర్తిని కోరుకుంటున్న ప్రిన్స్

దిశ, వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ మహేష్ బాబు… ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా తర్వాత ఏ సినిమాను ఫైనలైజ్ చేయలేదు. కానీ ‘గీతా గోవిందం’ ఫేం పరశురాం డైరెక్షన్‌లో మాత్రం సినిమా చేస్తున్నట్లు సమాచారం. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మూవీ చేయాల్సి ఉన్నా.. స్క్రిప్ట్ వర్క్ పూర్తి కాకపోవడంతో .. పరశురాం ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఫిల్మ్ నగర్ టాక్. ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా షూటింగ్‌లన్నీ వాయిదా పడగా.. క్వారెంటైన్ టైమ్‌లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నాడు. […]

Update: 2020-03-26 03:39 GMT

దిశ, వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ మహేష్ బాబు… ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా తర్వాత ఏ సినిమాను ఫైనలైజ్ చేయలేదు. కానీ ‘గీతా గోవిందం’ ఫేం పరశురాం డైరెక్షన్‌లో మాత్రం సినిమా చేస్తున్నట్లు సమాచారం. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మూవీ చేయాల్సి ఉన్నా.. స్క్రిప్ట్ వర్క్ పూర్తి కాకపోవడంతో .. పరశురాం ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఫిల్మ్ నగర్ టాక్. ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా షూటింగ్‌లన్నీ వాయిదా పడగా.. క్వారెంటైన్ టైమ్‌లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే పరశురాం ప్రాజెక్ట్‌లో హీరోయిన్‌గా ‘మహానటి’ని మరిపించిన కీర్తి సురేష్ అయితే బాగుంటుందని భావిస్తున్నాడట మహేష్. తనతో కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుందని అభిప్రాయపడుతున్నారట.

‘మహానటి’ తర్వాత అంత పెద్ద హిట్ అందుకోలేక పోయిన కీర్తి… ప్రస్తుతం ‘మిస్ ఇండియా’ సినిమాతో బిజీగా ఉంది. కానీ ఈ ప్రాజెక్ట్‌కు కూడా అంతగా బజ్ లేదు. ‘పెంగ్విన్’ సినిమాను అనౌన్స్ చేసినా… ఇంకా షూటింగ్ ప్రారంభమే కాలేదు. మరి మహేష్ బాబు సినిమాతో అయినా అంత బజ్ క్రియేట్ అయి… టాలీవుడ్‌లో కీర్తి బిజీ అవుతుందేమో చూడాలి.

tags : Mahesh Babu, Keerthi Suresh, Parashuram

Tags:    

Similar News