లారీ బైక్ ఢీ.. దానిపై నుండి లారీ పోవడంతో నుజ్జునుజ్జు..

దిశ, స్టేషన్ ఘన్ పూర్: జనగామ జిల్లా చిల్పూర్ మండలం మల్కాపూర్ – వెంకటాద్రి పేట గ్రామాల మధ్య జరిగిన రోడ్డు ప్రమాదంలో నర్మెట మండలం పోతారం గ్రామానికి పాకాల ప్రవీణ్, కాసర్ల జితేందర్ గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. ఏపీ22వి4299 నంబరు గల లారీ వెంకటాద్రి పేట నుండి మల్కాపూర్ వైపు వెళుతుండగా ఏపీ 09 బిఎఫ్ 68 06 నంబర్ గల బైక్ మల్కాపూర్ నుండి వెంకటాద్రి పేట వైపు వస్తుంది. ఈ నేపథ్యంలో […]

Update: 2021-06-07 05:13 GMT

దిశ, స్టేషన్ ఘన్ పూర్: జనగామ జిల్లా చిల్పూర్ మండలం మల్కాపూర్ – వెంకటాద్రి పేట గ్రామాల మధ్య జరిగిన రోడ్డు ప్రమాదంలో నర్మెట మండలం పోతారం గ్రామానికి పాకాల ప్రవీణ్, కాసర్ల జితేందర్ గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. ఏపీ22వి4299 నంబరు గల లారీ వెంకటాద్రి పేట నుండి మల్కాపూర్ వైపు వెళుతుండగా ఏపీ 09 బిఎఫ్ 68 06 నంబర్ గల బైక్ మల్కాపూర్ నుండి వెంకటాద్రి పేట వైపు వస్తుంది.

ఈ నేపథ్యంలో రెండు గ్రామాల మధ్య లారీ ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న పాకాల ప్రవీణ్ కాలు పై నుండి లారీ వెనక టైరు వెళ్లి కాలు నుజ్జునుజ్జు అయింది. మరో వ్యక్తి జితేంద్రకు స్వల్పగాయాలయ్యాయి. గాయపడిన వీరిద్దరిని చికిత్స నిమిత్తం వరంగల్‌కు తరలించారు. ఏఎస్సై శ్రీనివాస్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News