జొన్న అంబలిని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలివే !

జొన్న పిండితో అంబలిని తయారు చేసుకుని తాగడం వల్ల నీరసం, బలహీనత వంటి సమస్యలు తగ్గుతాయి.

Update: 2023-02-07 09:08 GMT

దిశ, వెబ్ డెస్క్ : జొన్న పిండితో అంబలిని తయారు చేసుకుని తాగడం వల్ల నీరసం, బలహీనత వంటి సమస్యలు తగ్గుతాయి. ఎముకలు దృఢంగా తయారవుతాయి. రక్త హీనత సమస్య తగ్గుతుంది. అలాగే ఈ అంబలిని తాగడం వల్ల జీర్ణ శక్తి మెరుగుపడుతుంది. మల బద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి. బరువు తగ్గాలనుకునే ఈ అంబలిని తాగడం వల్ల చక్కటి ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు .

అలాగే ఈ అంబలిని తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ తొలగిపోతుంది. గుండె ఆరోగ్యంగా పని చేస్తుంది. షుగర్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అంతే కాకుండా ఈ అంబలిని తాగడం వల్ల కండరాలు దృఢంగా తయారవుతాయి. దిన్ని రోజు తీసుకోవడం వల్ల శరీరంలో వేడి తగ్గుతుంది. ఈ విధంగా జొన్నలతో చేసిన అంబలి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని పిల్లల నుంచి పెద్ద వారి వరకు ఏవరైనా ఆహారంగా తీసుకోవచ్చు.

Barley Water : బార్లీ వాటర్‌తో కీళ్లు, మోకాళ్ల నొప్పులకు చెక్ !  


Similar News