Manu Bhaker :పారిస్ ఒలింపిక్స్‌లో హవా.. వైరల్‌గా మారిన మను బాకర్ రీల్స్.. చూసి తీరాల్సిందే!!

పారిస్ ఒలింపిక్స్ లో మను బాకర్ సత్తా చాటింది. ఎయిర్ పిస్టల్ షూటింగ్ విభాగంలో కాంస్య పతకం గెలిచి రికార్డు క్రియేట్ చేసింది. ఒలింపిక్స్ లో పిస్టల్ షూటింగ్ లో తొలి పతకం పొందిన మహిళగా చరిత్ర సృష్టించింది. ప్రధాన మంత్రి

Update: 2024-07-29 11:44 GMT

దిశ, ఫీచర్స్: పారిస్ ఒలింపిక్స్ లో మను బాకర్ సత్తా చాటింది. ఎయిర్ పిస్టల్ షూటింగ్ విభాగంలో కాంస్య పతకం గెలిచి రికార్డు క్రియేట్ చేసింది. ఒలింపిక్స్ లో పిస్టల్ షూటింగ్ లో తొలి పతకం పొందిన మహిళగా చరిత్ర సృష్టించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పెషల్ విషెస్ అందించగా.. సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. దేశ ప్రజలు ఆమె విజయాన్ని కీర్తిస్తూ అప్రిసియేషన్ ట్వీట్స్ పెడుతున్నారు. ఇదిలా ఉండగా.. మనుకు సంబంధించిన రీల్ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది.

పతకాల ఆలోచనలోనే నిమగ్నమైనప్పుడు ఎలా ఉంటుందనే సారాంశంతో ఉన్న రీల్ చూడడానికి కన్నుల విందుగా ఉంది. టీవీ చూస్తున్నప్పుడు.. తింటున్నప్పుడు.. చివరికి పడుకుంటున్నప్పుడు.. ఇలా ప్రతి చోట పతకాలతోనే జీవిస్తున్నట్లు ఉన్న రీల్ పై నెటిజన్లు రెస్పెక్ట్ ఫుల్ రియాక్షన్ ఇస్తున్నారు. భగవద్గీత కారణంగానే మెడల్ వచ్చిందని చెప్పడంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కంగ్రాట్స్ చెప్తున్నారు.

Tags:    

Similar News