లక్షకు తగ్గొద్దు.. చేవెళ్ల సభ తెలంగాణలో సంచలనం కావాలి

చేవెళ్లలో నిర్వహించనున్న ‘విజయ సంకల్ప సభ’ తెలంగాణలో సంచలనం కావాలని, చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో నిర్వహిస్తున్న ఈ సభకు కనీసం లక్ష మంది

Update: 2023-04-22 07:22 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: చేవెళ్లలో నిర్వహించనున్న ‘విజయ సంకల్ప సభ’ తెలంగాణలో సంచలనం కావాలని, చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో నిర్వహిస్తున్న ఈ సభకు కనీసం లక్ష మందికి తగ్గొద్దని, ప్రజలు, కార్యకర్తలరంతా స్వచ్ఛందంగా హాజరయ్యే అవకాశం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. తెలంగాణలో బీజేపీ గెలుపు ఖాయమనే సంకేతాలను ఈ సభ ద్వారా పంపాలని, వచ్చే ప్రజలు, కార్యకర్తలకు తగిన ఏర్పాట్లు చేయాలని బండి సంజయ్, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర నేతలకు టెలీ కాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేశారు. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో జరగబోయే తొలి సభను సక్సెస్ చేయడం ద్వారా తెలంగాణలో బీజేపీ గెలుపు ఖాయమనే నమ్మకాన్ని జాతీయ నాయకత్వానికి కల్పించాలని ఆయన చెప్పారు. రాష్ట్రంలో నియంత, నికృష్ణ, అవినీతి పాలన కొనసాగుతోందని, కేసీఆర్ వల్ల కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజలంతా బీజేపీపై నమ్మకంతో ఉన్నారన్నారు.

ఈ నేపథ్యంలో పార్టీని అణిచివేసేందుకు సీఎం కేసీఆర్ రాబోయే రోజుల్లో కార్యకర్తలను మరింత ఇబ్బందికి గురిచేసే ప్రమాదం ఉందని, అయినా ప్రజలు, పార్టీ అండగా ఉన్నందుకు కార్యకర్తలు భయపడాల్సిన పనిలేదని సంజయ్ సూచించారు. కేంద్రంలో ప్రధాని మోడీ ఆధ్వర్యంలో అవినీతి రహిత పాలన కొనసాగుతోందని, తెలంగాణలోనూ అలాంటి పాలనే కావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. చేవెళ్ల సభ ద్వారా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, రామరాజ్య స్థాపన తథ్యమనే సంకేతాలను పంపబోతున్నట్లు చెప్పారు. ఈ సభను సక్సెస్ చేయాలని కోరుతూ ప్రతి ఒక్కరూ మీడియా, సోషల్ మీడియా వేదికగా విస్తృత ప్రచారం చేపట్టాలని సంజయ్ నేతలకు పిలుపునిచ్చారు.

Tags:    

Similar News