ఆందోల్ మరో నలుగురికి కరోనా

దిశ, ఆందోల్: నియోజకవర్గాన్ని కరోనా వైరస్ పట్టిపీడిస్తోంది. రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఆందోల్-జోగిపేట రెవెన్యూ డివిజన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కరోనా పాజిటివ్ వ్యక్తి స్థానికంగా ఓ ఎలక్ట్రానిక్ దుకాణంలో టీవీ రిమోట్‌ను కొనుగోలు చేయడంతో షాపు యజమానికి ఆదివారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అలాగే మండల పరిధిలో మరో మూడు పాజిటివ్ కేసులు కూడా నమోదయ్యాయి. ఇదిలా ఉండగా గత వారం రోజుల నుంచి కొనసాగిన లాక్ […]

Update: 2020-07-26 09:19 GMT

దిశ, ఆందోల్: నియోజకవర్గాన్ని కరోనా వైరస్ పట్టిపీడిస్తోంది. రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఆందోల్-జోగిపేట రెవెన్యూ డివిజన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కరోనా పాజిటివ్ వ్యక్తి స్థానికంగా ఓ ఎలక్ట్రానిక్ దుకాణంలో టీవీ రిమోట్‌ను కొనుగోలు చేయడంతో షాపు యజమానికి ఆదివారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అలాగే మండల పరిధిలో మరో మూడు పాజిటివ్ కేసులు కూడా నమోదయ్యాయి. ఇదిలా ఉండగా గత వారం రోజుల నుంచి కొనసాగిన లాక్ డౌన్ ఆదివారంతో ముగియగా.. సోమవారం నుంచి యథావిధిగా తెరుచుకోనున్నాయి.


Similar News