కరోనాతో కాలపత్తర్ ఏఎస్సై మృతి
దిశ, క్రైమ్బ్యూరో: తెలంగాణ పోలీస్శాఖలో మరో కరోనా మరణం సంభవించింది. కొద్దిరోజులు క్రితం కానిస్టేబుల్, హోంగార్డులు కరోనా బారిన పడి మరణించగా… సోమవారం ఉదయం కాలపత్తర్ ఏఎస్సై చనిపోయాడు. ఇన్నిరోజులు ఛత్రినాక పీఎస్లో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహించిన అతను 20రోజుల క్రితమే కాలపత్తర్ పోలీస్స్టేషన్కు బదిలీ అయ్యారు. ఈనెల 15న ఏఎస్ఐకి కరోనా నిర్ధారణ కాగా అప్పటి నుంచి గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మరణించాడు. దీంతో పోలీస్శాఖలో కరోనా మృతుల సంఖ్య మూడుకు […]
దిశ, క్రైమ్బ్యూరో: తెలంగాణ పోలీస్శాఖలో మరో కరోనా మరణం సంభవించింది. కొద్దిరోజులు క్రితం కానిస్టేబుల్, హోంగార్డులు కరోనా బారిన పడి మరణించగా… సోమవారం ఉదయం కాలపత్తర్ ఏఎస్సై చనిపోయాడు. ఇన్నిరోజులు ఛత్రినాక పీఎస్లో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహించిన అతను 20రోజుల క్రితమే కాలపత్తర్ పోలీస్స్టేషన్కు బదిలీ అయ్యారు. ఈనెల 15న ఏఎస్ఐకి కరోనా నిర్ధారణ కాగా అప్పటి నుంచి గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మరణించాడు. దీంతో పోలీస్శాఖలో కరోనా మృతుల సంఖ్య మూడుకు చేరింది.