Diwali Lucky Zodiacs: దీపావళి పండగ నుంచి ఈ మూడు రాశులవారికి తిరుగులేదు.. మీ రాశి ఉందా?

దీపావళి పండగ నుంచి ఈ మూడు రాశులవారికి తిరుగులేదు..

Update: 2024-10-27 07:27 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఈ సంవత్సరం దీపావళి పండగ అక్టోబర్ 31 న జరుపుకోనున్నారు. హిందూ సాంప్రదాయం ప్రకారం, ప్రతి ఒక్కరూ ఈ రోజునే లక్ష్మీపూజ చేస్తారు. ఉదయాన్నే లేచి లక్ష్మీదేవికి పూజించి ఉపవాసాలు చేయడం వలన కోరిన కోరికలు నెరవేరుతాయి. ఇలా చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. అలాగే, డబ్బు సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. ఆ రోజున కొన్ని రాశుల వారికీ శుభంగా ఉండనుంది. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..  

మేష రాశి

మేష రాశివారికి దీపావళి పండగ రోజు నుంచి మంచిగా ఉంటుంది. పెట్టుబడులు పెట్టె వారికీ ఇది మంచి సమయం. ఈ సమయంలో మీరు మొదలు పెట్టిన పనుల్లో విజయాలు సాధిస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మేష రాశివారి కష్టాలు తీరిపోతాయి. ఆర్థిక సమస్యలు మెరుగుపడతాయి. పాత కాలంలో కొనుగోలు చేసిన భూములుకు రేట్లు పెరుగుతాయి. దీని వల్ల మీ కుటుంబం మొత్తం సంతోషంగా ఉంటుంది.

వృషభ రాశి

వృషభ రాశి వారు దీపావళి పండగ నుంచి కొత్త పనులు మొదలు పెట్టొచ్చు. అంతేకాకుండా, వ్యాపారాల్లో కూడా లాభాలు పెరుగుతాయి. ఉద్యోగం లేని వారికీ ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. అలాగే కెరీర్‌ పరంగా అద్భుతంగా ఉంటుంది. ఈ సమయంలో ఇల్లు లేదా కారు కొనుగోలు చేసే అవకాశం ఉంది.

మిథున రాశి

మిథున రాశి వారికి కూడా కెరీర్‌ పరంగా ఉన్న సమస్యలు తొలగిపోతాయి. అంతేకాకుండా డబ్బు కూడా రెట్టింపు అవుతుంది. అలాగే, వ్యాపారాలు కూడా మెరుగుపడతాయి. మీ కుటుంబ జీవితంలో సంతోషం కూడా ఒక్కసారిగా పెరుగుతుంది. 

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.

Tags:    

Similar News