మరో రెండ్రోజులు భారీ వర్ష సూచన

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో భారీ వర్షాలు కురిశాయి. బుధవారం మూడు జిల్లాలో అతిభారీ వర్షాలు పడ్డాయి. సంగారెడ్డి జిల్లా ఆందోల్‌లో 19.4 సెంటిమీటర్లు, సిద్దిపేట జిల్లా తొగుటలో 12.5 సెంటి మీటర్లు, సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో 12.1 సెంటిమీటర్ల వర్షం కురిసింది. అదే విధంగా మంచిర్యాల జిల్లాలో సగటు వర్షపాతం 11.1 సెంటిమీటర్లు పడింది. కామారెడ్డిలో 10.8 సెం.మీ, సిద్దిపేట జిల్లా కొండపాకలో 10.6 సెంటిమీటర్లు కురిసింది. రాష్ట్రంలో 15జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైంది. పది జిల్లాలో […]

Update: 2020-07-15 09:41 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో భారీ వర్షాలు కురిశాయి. బుధవారం మూడు జిల్లాలో అతిభారీ వర్షాలు పడ్డాయి. సంగారెడ్డి జిల్లా ఆందోల్‌లో 19.4 సెంటిమీటర్లు, సిద్దిపేట జిల్లా తొగుటలో 12.5 సెంటి మీటర్లు, సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో 12.1 సెంటిమీటర్ల వర్షం కురిసింది. అదే విధంగా మంచిర్యాల జిల్లాలో సగటు వర్షపాతం 11.1 సెంటిమీటర్లు పడింది. కామారెడ్డిలో 10.8 సెం.మీ, సిద్దిపేట జిల్లా కొండపాకలో 10.6 సెంటిమీటర్లు కురిసింది. రాష్ట్రంలో 15జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైంది. పది జిల్లాలో సాధారణ వర్షపాతంగా ఉంది. కేవలం నిర్మల్ జిల్లాలో మాత్రమే తక్కువ వర్షం కురిసింది. ఇక వచ్చే రెండ్రోజులు కూడా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది.

గ్రేటర్​లో పలుచోట్ల వర్షం

హైదరాబాద్‌ నగరంలో బుధవారం పలు భారీ చోట్ల వర్షపాతం నమోదయింది. బాలానగర్​లో 7.6 మిమీ, ఫిరోజ్​గూడలో 6.7 మిమీ, బేగంపేటలో 5 మిమీ, కూకట్​పల్లిలో 4.9మిమీ, చార్మినార్​, సికింద్రాబాద్​, అమీర్​పేట, ఖైరతాబాద్​ ఏరియాల్లో 3మిమీలకు పైగా వర్షపాతం నమోదయింది. నాంపల్లి, బండ్లగూడ, వెస్ట్​ మారేడ్​పల్లి, ఆసిఫ్​నగర్​ , మల్కాజ్​గిరిల్లో 2.5మిమీ వర్షపాతం నమోదయింది. రోడ్లపై వర్షపు నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

Tags:    

Similar News