గుండె జబ్బులు ఉన్నవారు ‘నెయ్యి’ తినొచ్చా..నిపుణులు ఏం చెబుతున్నారంటే?

ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా గుండెపోటుతో చనిపోయే వారి సంఖ్య పెరుగుతోంది.

Update: 2024-06-26 14:39 GMT

దిశ,వెబ్‌డెస్క్: ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా గుండెపోటుతో చనిపోయే వారి సంఖ్య పెరుగుతోంది. హర్ట్‌ఎటాక్ అంటే చాలు పెద్దవారిలో కనిపించే సమస్యగా అందరికీ తెలుసు కానీ ప్రజెంట్ జనరేషన్‌లో చిన్న పెద్ద తేడా లేకుండా ఈ సమస్య వేధిస్తోంది. ఈ సమస్య ఎప్పుడు ఎటూ నుంచి ఎటాక్ చేస్తుందో తెలియదు. గుండె పోటు లక్షణాలు చాలా రకాలుగా ఉంటాయని వాటిని నిర్లక్ష్యం చేస్తే అంతే సంగతి అని వైద్యులు చెబుతున్నారు. గుండె నొప్పికి ప్రధానంగా ఆహారపు అలవాట్లు కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. ఎందుకంటే మారుతున్న జీవన శైలి, కొన్ని రకాల ఆహారపు అలవాట్లు గుండె జబ్బులు పెరగడానికి కారణం అవుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. గుండె రోగులు తమ కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుకుంటే, ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చంట. మనం తినే ఆహారంలో పెద్ద మొత్తంలో కొవ్వు ఉంటే కొలెస్ట్రాల్ ప్రమాదాన్ని పెంచి గుండె సమస్యలకు దారి తీస్తుందనే విషయం తెలిసిందే.

నిపుణుల సలహాలు ఏంటంటే?

ఈ క్రమంలో గుండె సమస్యలు ఉన్నవారు నెయ్యి లేదా వెన్న తినడం తగ్గిస్తే మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. నెయ్యి లేదా వెన్నలో కొవ్వు అధికంగా ఉండటం వల్ల సమస్య పెద్దదయ్యే అవకాశం ఉందంటున్నారు. చాలా మంది గుండె సమస్యలున్నవారు తమ డైట్‌లో నెయ్యి లేదా వెన్న లేకుండా జాగ్రత్త పడతారు. అలానే జున్ను, బీన్స్, కూరగాయలు వంటి ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలను తినడం ఆరోగ్యానికి మంచిదని సలహా ఇస్తున్నారు. చక్కెర, ఉప్పు అధికంగా ఉన్న ఆహారాన్ని దూరం పెట్టడం మంచిదంటున్నారు. ఈ నేపథ్యంలో నీళ్లు ఎక్కువగా తాగాలి. సరైన సమయంలో ఆహారం తినడం, సమయానికి నిద్ర పోవడం వంటి అలవాట్లను పాటించడం, అలాగే మద్యపానానికి దూరంగా ఉండటం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

NOTE:ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.

Similar News