APRDC CET-2023 నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా నాగార్జునసాగర్‌లోని రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలో 2023-24 విద్యా సంవత్సరానికి డిగ్రీ (ఇంగ్లీష్ మీడియం) తొలి ఏడాది ప్రవేశాలకు గుంటూరు ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ దరఖాస్తులు కోరుతోంది.

Update: 2023-04-04 12:46 GMT

దిశ, ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా నాగార్జునసాగర్‌లోని రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలో 2023-24 విద్యా సంవత్సరానికి డిగ్రీ (ఇంగ్లీష్ మీడియం) తొలి ఏడాది ప్రవేశాలకు గుంటూరు ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ దరఖాస్తులు కోరుతోంది. ఇందుకు సంబంధించి ఏపీ ఆర్‌డీసీ సెట్- 2023 నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఎంట్రన్స్ టెస్ట్:

ఏపీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ - 2023.

మొత్తం సీట్లు: 152

గ్రూపులు- సీట్లు:

బీఏ (హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్) - 40

బీకాం - 40

బీఎస్సీ (మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ) - 36

బీఎస్సీ (మ్యాథ్స్, స్టాటిస్టిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్) - 36

అర్హత: 2022-23 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ లేదా తత్సమాన అర్హత పరీక్ష ఉత్తీర్ణత.

ఎంపిక: కామన్ ఎంట్రన్స్ టెస్ట్, రిజర్వేషన్ ఆధారంగా..

పరీక్ష ఫీజు: రూ. 300 చెల్లించాలి.

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: ఏప్రిల్ 4, 2023.

చివరి తేదీ: ఏప్రిల్ 24, 2023.

ఎంట్రన్స్ పరీక్ష తేదీ: మే 20, 2023.

వెబ్‌సైట్: https://aprs.apcfss.in/

Tags:    

Similar News