Tirumala Updates: తిరుమలలో కొనసాగుతోన్న వైకుంఠ ద్వార దర్శనం

భక్తుల కొంగు బంగారం శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల (Tirumala)లో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.

Update: 2025-01-16 03:23 GMT
Tirumala Updates: తిరుమలలో కొనసాగుతోన్న వైకుంఠ ద్వార దర్శనం
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: భక్తుల కొంగు బంగారం శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల (Tirumala)లో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. కట్టుదిట్టమైన భద్రత నడుమ వైకుంఠ ద్వార దర్శన ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. బుధవారం పండుగ రోజు కావడంతో స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు ఓ మోస్తరుగా తరలివచ్చారు. ఈ మేరకు టోకెన్లు లేని భక్తుల దర్శనానికి 9 గంటల సమయం, రూ.300 ప్రత్యేక దర్శనానికి (Special Darshan) ఒక గంట సమయం పడుతోంది. ఇక గురువారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ (Vaikuntam Que Complex)లోని 3 కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. బుధవారం స్వామి వారిని 71,417 మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ (Srivari Hundi) ఆదాయం రూ.3.42 కోట్లు వచ్చాయని టీటీడీ అధికారులు (TTD Offcials) వెల్లడించారు.

Tags:    

Similar News