కరోనాపై నిర్లక్ష్యం.. రేషన్ షాపుల్లో గుంపులు 

దిశ, మహబూబ్‌నగర్: కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నా కొంత మంది మాత్రం నిర్లక్ష్యం వీడటం లేదు. కరోనాకు మందు లేదని, సామాజిక దూరం పాటించాలని ప్రభుత్వాలు ఎంత చెప్పినా సీరియస్‌గా తీసుకోవడం లేదు. లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రభుత్వం రేషన్‌కార్డుదారుడికి 12 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తోంది. దీనికితోడు నెల కోటా రేషన్ సరుకులు కూడా ఇస్తున్నారు. అయితే, మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో కొన్ని రేషన్‌షాపుల వద్ద జనం సామాజిక దూరం పాటించడం లేదు. గుంపులు గుంపులుగా […]

Update: 2020-04-02 21:21 GMT

దిశ, మహబూబ్‌నగర్: కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నా కొంత మంది మాత్రం నిర్లక్ష్యం వీడటం లేదు. కరోనాకు మందు లేదని, సామాజిక దూరం పాటించాలని ప్రభుత్వాలు ఎంత చెప్పినా సీరియస్‌గా తీసుకోవడం లేదు. లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రభుత్వం రేషన్‌కార్డుదారుడికి 12 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తోంది. దీనికితోడు నెల కోటా రేషన్ సరుకులు కూడా ఇస్తున్నారు. అయితే, మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో కొన్ని రేషన్‌షాపుల వద్ద జనం సామాజిక దూరం పాటించడం లేదు. గుంపులు గుంపులుగా ఎగబడుతున్నారు.

Tags: crowds, mahaboobnagar, gathered, ration shops, lockdown

Tags:    

Similar News