Road accident: హైదరాబాద్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు విద్యార్థులు మృతి

హైదరాబాద్ శివారు దుండిగల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా దూసుకెళ్లిన ఓ స్కోడా కారు లారీని ఢీకొట్టింది.

Update: 2024-07-19 15:26 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ శివారు దుండిగల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా దూసుకెళ్లిన ఓ స్కోడా కారు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. ప్రమాదానికి గురైన కారు దుండిగల్ నుంచి కుత్బుల్లాపూర్‌ వైపు వెళ్తుండగా ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ పాయింట్ ఐదు వద్ద ఈ ఘటన జరిగింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. మృతులను విజ్ఞాన్‌జ్యోతి కాలేజీకి చెందిన విద్యార్థులుగా గుర్తించారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తోన్న పోలీసులు.. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్థారించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 


Similar News