సూర్యాపేట జిల్లాలో తీవ్ర విషాదం.. క్వారీ గుంతల్లో ఈతకు వెళ్లి ముగ్గురు మృతి

సూర్యాపేట జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. సరదా క్వారీ గుంతల్లో ఈతకు వెళ్లి ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు

Update: 2024-07-17 06:18 GMT

దిశ, వెబ్‌డెస్క్: సూర్యాపేట జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. క్వారీ గుంతల్లో ఈతకు వెళ్లి ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు యువకులు, ఓ బాలిక ఉన్నారు. ఆత్మకూరు (ఎస్) మండలంలోని బొప్పారం గ్రామంలో బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది. మృతులు హైదరాబాద్ నుంచి బంధువుల ఇంటికి వచ్చి స్థానిక క్రషర్ గుంతల్లో ఈతకు వెళ్లినట్లు సమాచారం. చుట్టుపు చూపుగా వచ్చి ఒకేసారి ముగ్గురు మృత్యువాత పడటంతో బొప్పారంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Similar News