రాత్రి ఉన్న డబ్బులు తెల్లవారే సరికి చోరీ

నిజామాబాద్ నగరంలో తాళం వేసి ఉన్న గజానన్ మెడికల్ షాప్ లో శుక్రవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు.

Update: 2024-09-14 15:11 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలో తాళం వేసి ఉన్న గజానన్ మెడికల్ షాప్ లో శుక్రవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. క్యాష్ కౌంటర్ లో ఉన్న రూ. 1.18 లక్షలు ఎత్తుకెళ్లారు. క్యాష్ కౌంటర్ లోని డబ్బులు శనివారం వచ్చి చూసేసరికి కనిపించకుండా పోయాయని షాపు యజమాని బందెవార్ సంతోష్ కుమార్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ హెచ్ ఓ మహేశ్ కుమార్ తెలిపారు. 

Tags:    

Similar News