అమానుష ఘటన.. ఆడపిల్లను కాల్చేసిన గుర్తు తెలియని వ్యక్తులు

మానవత్వం మంట కలిసి పోయేలా అమానుష సంఘటన సదాశివ నగర్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది.

Update: 2023-12-14 05:03 GMT

దిశ, గాంధారి: మానవత్వం మంట కలిసి పోయేలా అమానుష సంఘటన సదాశివ నగర్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం బొంపల్లి గ్రామానికి సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు కెనాల్ కు సమీపంలో ఆడపిల్లను అతి దారుణంగా కాల్చి వేసిన సంఘటన కలకలం రేపుతుంది. దీనిపై సదాశివనగర్ సీఐ రామన్ ను వివరణ కోరగా క్లూస్ టీం వస్తుందని వచ్చిన తర్వాతనే పూర్తి వివరాలు తెలుస్తాయని ఎట్టి పరిస్థితుల్లో నిందితులను వదిలిపెట్టేది లేదని చట్టరీత్యా చర్యలు తీసుకోవడం ఖాయమని వెల్లడించారు.


Similar News