చిన్నారి ప్రాణాలను తీసిన పశువుల మేత

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామానికి చెందిన మహమ్మద్ జియావుద్దీన్ (4) అనే చిన్నారి ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుని మృతి చెందిన ఘటన సోమవారం సంభవించింది.

Update: 2023-12-18 14:25 GMT

దిశ, ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామానికి చెందిన మహమ్మద్ జియావుద్దీన్ (4) అనే చిన్నారి ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుని మృతి చెందిన ఘటన సోమవారం సంభవించింది. పూర్తి వివరాల్లోకెళితే చేపూర్ గ్రామానికి చెందిన మహమ్మద్ జియావుద్దీన్ మరో బాలికతో కలిసి ఆ గ్రామంలో ఉన్న ఒక పాడుబడ్డ ఇంట్లో ఆడుకుంటున్నారు. ఆ ఇంట్లో పశువులకు వేయడానికి నిలువ ఉంచిన సొప్ప ఉంది. నిలువ ఉంచిన పశువుల మేత సమీపంలో ఇద్దరు చిన్నారులు మంట పెట్టుకుని ఆడుకుంటున్నారు.

ఈ క్రమంలోనే పశువుల మేతకు నిప్పు అంటుకుంది. ఆ మంటల్లో చిన్నారి మహమ్మద్ జియావుద్దీన్ చిక్కుకుని పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యాడు. జియావుద్దీన్ తో ఆడుకుంటున్న బాలిక జియా భాను సమయస్పూర్తితో బయటికి వచ్చి ప్రాణాలు కాపాడుకుంది. సంఘటనా స్థలాన్ని ఆర్మూర్ ఎస్ హెచ్ ఓ సురేష్ బాబు, ఫైర్ సీఐ, ఆర్మూర్ ఎస్సై గంగాధర్ లు పరిశీలించి ప్రమాదానికి గల కారణాలు తెలుసుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అగ్ని ప్రమాదంలో మృతి చెందిన ఆ చిన్నారి బాలుడిని ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

Tags:    

Similar News