CRIME: పిల్లల్ని చంపి ఆత్మహత్య చేసుకున్న భార్యాభర్తలు

ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

Update: 2024-09-01 03:45 GMT

దిశ, పేట్ బషీరాబాద్: ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. గాజులరామారంలో మంచిర్యాలకు చెందిన వెంకటేష్ (40), వర్షిని (33) భార్య భర్తలు. వీరికి రిషికాంత్ (11), విహాంత్ (3) ఇద్దరు సంతానం. అయితే వీరు నలుగురు ఆత్మహత్య చేసుకున్నట్లుగా ఆదివారం తెల్లవారుజామున వెలుగులోకి వచ్చింది. ముందుగా పిల్లల్ని చంపి తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్నట్లుగా చెబుతున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. జీడిమెట్ల పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.




Similar News