చేపల వేటకు వెళ్లి అనంతలోకాలకు...

చేపల వేటకు వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతి చెందాడు. మృతుడు రెంజల్ మండలం మౌలాలితండాకు చెందిన జాదవ్ సంతోష్ (38)గా గుర్తించారు.

Update: 2024-09-22 13:43 GMT

దిశ, నవీపేట్ : చేపల వేటకు వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతి చెందాడు. మృతుడు రెంజల్ మండలం మౌలాలితండాకు చెందిన జాదవ్ సంతోష్ (38)గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రెంజల్ మండలం మౌలాలి తండాకు చెందిన జాదవ్ సంతోష్ ఆదివారం చేపల వేటకు తమ గ్రామసమీపంలో ఉన్న అలీసాగర్ కెనాల్ ప్రధాన కాలువ వద్దకు వెళ్లి తిరిగిరాలేదు.

    దాంతో కుటుంబ సభ్యులు కాలువ పరిసరాలను వెతకగా అక్కాడ మృతుని బట్టలు కనిపించాయి. దాంతో అలీసాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ సిబ్బందికి సమాచారం అందించి నీటిని బంద్ చేసి గాలించడంతో మృతదేహం లభించింది. మృతుని తండ్రి జాదవ్ వసంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పంచనామా అనంతరం పోస్టుమార్టం కోసం జిల్లా జనరల్ హాస్పిటల్ కు తరలించామని, మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారని ఎస్సై కె. వినయ్ తెలిపారు.

Tags:    

Similar News