Cheetah: నారాయణ‌పేట జిల్లాలో విషాదం.. అనుమనాస్పద స్థితిలో చిరుత మృతి

అనుమానాస్పద స్థితిలో చిరుత‌పులి మృతి చెందిన ఘటన నారాయణ‌పేట జిల్లా మద్దూరు మండల పరిధిలోని జాదరావుపల్లి గ్రామ శివారులో చోటుచేసుకుంది.

Update: 2024-08-16 03:32 GMT

దిశ మద్దూరు: అనుమానాస్పద స్థితిలో చిరుత‌పులి మృతి చెందిన ఘటన నారాయణ‌పేట జిల్లా మద్దూరు మండల పరిధిలోని జాదరావుపల్లి గ్రామ శివారులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామ శివారులో తాటిగట్టు సమీపంలోని రాయంచెరువు వద్ద గురువారం రాత్రి చిరుతపులి మృతి చెందినట్లుగా గ్రామస్తులు గుర్తించారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్ సెక్షన్ అధికారి లక్ష్మణ్ నాయక్ రాత్రి వేళ కావడం‌తో ఘటనా స్థలానికి వెళ్లలేకపోయారు. విషయాన్ని ఉన్నతాధికారులకు సమాచారం అందించినట్లు ఆయన తెలిపారు. మద్దూరు మండలంలోని నందిపాడ్, జాదరావ్‌పల్లి, పెదిరిపాడ్ శివారులో ఇటీవల కాలంలో రెండు చిరుత పులులు మృతి చెందగా.. కొత్తపల్లి మండలంలోని దుప్పటి గట్టు గ్రామ శివారులో చిరుత పులి సంచారం వల్ల మండలంలో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

Tags:    

Similar News