Brutal Murder: మెదక్ జిల్లాలో దారుణం.. గంజాయి మత్తులో యువకుడి దారుణ హత్య

గంజాయి మత్తులో నిండు ప్రాణం బలైన ఘటన మెదక్ జిల్లా శివంపేటలో చోటుచేసుకుంది.

Update: 2024-09-09 11:53 GMT

దిశ, వెబ్‌డెస్క్: గంజాయి మత్తులో నిండు ప్రాణం బలైన ఘటన మెదక్ జిల్లా శివంపేటలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శివంపేటకు చెందిన ఇద్దరు యువకులు మణికంఠ, తిరుపతి చాలా రోజుల నుంచి గంజాయికి బానిసలయ్యారు. ఈ క్రమంలోనే ఈ నెల 4న ఓ విషయంలో యాచకుడు గొడవకు దిగిన వారు అతడిని తమ బైక్‌కు కట్టేసి కొద్ది దూరం ఈడ్చుకెళ్లారు. అయితే, ఆ గాయాలకు తాళలేక అతడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. స్థానికుల సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్న శివంపేట పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.


Similar News