BREAKING : గన్‌తో కాల్చుకుని కానిస్టేబుల్ సూసైడ్

విశాఖలో గన్ తో కాల్చుకుని ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ సూసైడ్ చేసుకున్నాడు.

Update: 2024-04-11 02:35 GMT

దిశ ప్రతినిధి, విశాఖపట్నం : ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ గన్‌తో కాల్చుకుని సూసైడ్‌కు పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. శంకర్రావు అనే కానిస్టేబుల్ గన్‌తో కాల్చుకొని గురువారం ఉదయం ఆత్మహత్య‌కు పాల్పడ్డారు. ఉదయం ఐదు గంటలకు డ్యూటీకి హాజరైన శంకర్రావు తన వద్ద ఉన్న ఎస్‌ఎల్‌ఆర్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ద్వారకా నగర్ పరిధిలోని ఐఓబి బ్యాంకులో గన్ మెన్‌గా విధులు నిర్వహిస్తున్న శంకర్రావుకి భార్య ఇద్దరు పిల్లలు వున్నారు. శంకర్రావు ఆత్మహత్యకు గల కారణమాలపై దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ రాంబాబు తెలిపారు. చాతిలో తన గన్ తో తానే కాల్చుకున్నట్లు స్పష్టం చేశారు. 


Similar News