ఊరుచివర ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య..

కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని బిజ్జల్ వాడి గ్రామానికి చెందిన మారుతి అనే వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు జుక్కల్ ఎస్సై భువనేశ్వర్ తెలిపారు.

Update: 2024-09-08 09:50 GMT

దిశ, జుక్కల్ : కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని బిజ్జల్ వాడి గ్రామానికి చెందిన మారుతి అనే వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు జుక్కల్ ఎస్సై భువనేశ్వర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారంగా అదే గ్రామానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు నిజాంబాద్ లోని మిల్లులో హమాలి కూలి పనులు చేసుకునేవారు.

పనులు చేసుకునే స్థలం నుంచి తమ సామాన్లు తీసుకుని వస్తానని ఇంటి నుంచి బయలుదేరి వెళ్లిన అన్న మారుతి ఇంటికి తిరిగి రాలేదని మృతుని తమ్ముడు తెలిపారు. ఈ విషయం పై జుక్కల్ పోలీసులకు సెప్టెంబర్ ఒకటిన ఫిర్యాదు చేశామని మృతుడి తమ్ముడు యాదవ్ తెలిపారు. అయితే ఈనెల 7న గ్రామానికి పక్కనే ఉన్న అంగర్గా శివారులో టేకు చెట్టుకు ఉరి వేసుకున్నట్లు స్థానికులు గమనించారని, ఆ సమాచారం తెలుసుకుని కుటుంబీకులు తమకు చెప్పారని పోలీసులు తెలిపారు. మృతుడి తమ్ముడు యాదవ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.


Similar News