కత్తులతో రెచ్చిపోయిన యువకులు (వీడియో)

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌(Rajendranagar)లో కొందరు యువకులు కత్తులతో రెచ్చిపోయారు.

Update: 2024-09-26 04:53 GMT

దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌(Rajendranagar)లో కొందరు యువకులు కత్తులతో రెచ్చిపోయారు. వివరాల్లోకి వెళితే.. బుధవారం అర్థరాత్రి రాజేంద్రనగర్ పిల్లర్ నంబర్ 209 వద్ద ఉన్న రాయల్ జ్యూస్ సెంటర్‌లో కస్టమర్ల మధ్య గొడవ జరిగిది. ఆ గొడవను అడ్డుకోబోయిన షాపు యజమానిపై 15 మంది యువకులు కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో మొత్తం 8 మందికి గాయాలు అయ్యాయి. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని సదరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Similar News