విషాదం.. ట్రాక్టర్ తిరగబడి రైతు మృతి
మండల పరిధిలోని ఎలుకుంట్ల గ్రామంలో దామోదర్(40) అనే రైతు ప్రమాదవశాత్తు ట్రాక్టర్ తిరగబడి చనిపోయాడు.
దిశ, ధర్మవరం రూరల్:మండల పరిధిలోని ఎలుకుంట్ల గ్రామంలో దామోదర్(40) అనే రైతు ప్రమాదవశాత్తు ట్రాక్టర్ తిరగబడి చనిపోయాడు. ఈరోజు (శుక్రవారం) తన పొలంలో ట్రాక్టర్తో వ్యవసాయం చేస్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ తిరగబడటంతో అక్కడికక్కడే చనిపోయినట్టు గ్రామస్తులు తెలిపారు. దామోదర్ చనిపోయిన విషయం తెలిసి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై ధర్మవరం రూరల్ పోలీసులు కేసు నమోదు, చేసి దర్యాప్తు చేస్తున్నారు.