అమ్మాయి అదృశ్యం.. 5 రాష్ట్రాలు దాటిమరీ..

Update: 2022-01-18 06:41 GMT

దిశ, వెబ్‌డెస్క్: 2020లో అదృశ్యం అయిన 17ఏళ్ల అమ్మాయిని పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. ఇన్నాళ్లు కష్టపడిన పోలీసులు అమ్మాయి జాడను కనిపెట్టారు. అమ్మాయి తనకు ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన 35ఏళ్ల వ్యక్తితో కలిసి జీవిస్తోందని పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమ్మాయిని పట్టుకునేందుకు ఐదు రాష్ట్రాల పోలీసులు శ్రమించారని, అమ్మాయితో ఉన్న వ్యక్తిని గుర్తించేందుకు 40 సీసీ కెమెరాల ఫుటేజీలను పోలీసులు తనిఖీ చేశామని తెలిపారు. కానీ అమ్మాయి మాత్రం వీటన్నింటిని తప్పించుకుని వెళ్లిందని చెప్పారు. అంతేకాకుండా అమ్మాయి 3 నెలల క్రితం పాపకు జన్మనిచ్చిందని పోలీసులు పేర్కొన్నారు.

Tags:    

Similar News