భారీ ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి

త్తీస్‌ఘడ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్(encounter) జరిగింది. సోమవారం మధ్యాహ్నం పోలీసులకు, మావోయిస్టు(Maoists)లకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.

Update: 2024-09-23 13:06 GMT

దిశ, వెబ్‌డెస్క్‌: ఛత్తీస్‌ఘడ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్(encounter) జరిగింది. సోమవారం మధ్యాహ్నం పోలీసులకు, మావోయిస్టు(Maoists)లకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. నారాయణపూర్ జిల్లా అబూజ్‌మడ్ అటవీప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అనంతరం భద్రతా బలగాలు ఘటనా స్థలానికి చేరుకొని ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేశారు. ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Similar News