అమ్మవారి ఆలయంలో చోరీ.. తాళిబొట్టు,హుండీ మాయం

జహీరాబాద్ మండలం అల్గోల్ గ్రామంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ గుడి లో

Update: 2024-10-08 13:41 GMT

దిశ,జహీరాబాద్: జహీరాబాద్ మండలం అల్గోల్ గ్రామంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ గుడి లో దొంగలు పడ్డారు. అమ్మవారి కిరీటం, తాళిబొట్టు తో పాటు హుండీని అపహరించారు. సుమారు రూ.1.25లక్షల విలువైన అమ్మవారి నగలను దోచుకుని వెళ్లారు. గుడిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, టీవీతో పాటు, భజన సామాగ్రి మొదలైన వాటిని ధ్వంసం చేశారు.

అనంతరం వారు గ్రామంలోని ఇళ్లలో చోరికి యత్నించగా గమనించిన స్థానికులు కేకలేయడంతో దొంగలు పరారయ్యారు. గతంలో సైతం ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయని అయినప్పటికీ మరోసారి పునరావృతం కావడం పట్ల వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చోరీకి సంబంధించిన దృశ్యాలు ఆలయంలోని సీసీ పుటేజీ ఆధారంగా పట్టుకుంటామని ఎస్ఐ. కాశీనాథ్ చెప్పారు.


Similar News