కీసరలో కిరాణ దుకాణంలో చోరీ

కిరాణ దుకాణంలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడిన ఘటన

Update: 2024-10-11 14:32 GMT

దిశ, కీసర : కిరాణ దుకాణంలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడిన ఘటన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కీసర సీఐ వెంకటయ్య వివరాల ప్రకారం.. కీసర మండల కేంద్రంలోని శివాజీ నగర్ కు చెందిన ఆలీ అదే కాలనీలో కిరాణ దుకాణం నిర్వహిస్తున్నాడు. గురువారం రాత్రి దుకాణానికి తాళం వేసి ఇంటికి వెళ్లగా.. అర్ధరాత్రి వేళ గుర్తు తెలియని దుండగులు షట్టర్ ను ఇనుప రాడ్లతో పగులగొట్టి లోపలికి ప్రవేశించారు.

కిరాణ దుకాణంలో చొరబడి రూ.10 లక్షల విలువ చేసే సామాగ్రితో పాటు నగదు ఎత్తుకెళ్ళారు. కిరాణ దుకాణం షటర్ ను మొదట సీసీ కెమెరా కనెక్షన్లు కట్ చేసి డీవీఆర్ ఎత్తుకెళ్లారు. దుకాణంలో ఉన్న రూ.4 లక్షలు విలువ చేసే సిగరెట్ ప్యాకెట్లు, ప్రైవేటు చిట్టీ ఎత్తగా వచ్చిన డబ్బులు తెచ్చి డ్రాలో పెట్టిన రూ.5.23 లక్షల నగదును తీసుకెళ్లారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కీసర పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


Similar News