తప్పించుకు తిరుగుతున్న నిందితుడు రిమాండ్​

గంజాయి కేసులో కొంత కాలంగా తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని రిమాండ్​కు తరలించారు.

Update: 2024-10-18 15:44 GMT

దిశ, చందుర్తి : గంజాయి కేసులో కొంత కాలంగా తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని రిమాండ్​కు తరలించారు. సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం గతంలో ఇద్దరు వ్యక్తులు గంజాయి తరలిస్తుండగా మల్యాల గ్రామ శివారులో నిందితుడు చేపూరి రోహన్ పై కేసు నమోదు చేసి రిమాండ్​కు పంపామని తెలిపారు. మరో వ్యక్తి లింగంపేట గ్రామానికి చెందిన మేకల రాహుల్ అప్పటి నుండి పరారీలో ఉన్నాడు. శుక్రవారం నిందితుడు శంషాబాద్ ఎయిర్​పోర్టులో ఉన్నాడని నమ్మదగిన సమాచారంతో అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్​కు పంపించినట్లు సీఐ తెలిపారు. యువత డ్రగ్స్ బారినపడి బంగారు భవిష్యత్తు నాశనం చేసుకోవద్దన్నారు. స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించి గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నట్టు చెప్పారు.  

Tags:    

Similar News