ఘోరం.. పిడుగుపాటుకు మహిళ మృతి

పిడుగుపాటుకు మహిళ మృతి చెందిన ఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకుంది.

Update: 2024-09-23 03:12 GMT

దిశ,వనపర్తి : పిడుగుపాటుకు మహిళ మృతి చెందిన ఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకుంది. వనపర్తి రూరల్ ఎస్ ఐ జలంధర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. వనపర్తి మండలం చిమనగుంట పల్లికి చెందిన గొర్రెల కాపరిగా వెళ్లిన గొల్ల పద్మ(35) పిడుగుపాటుకు గురై సుమారు నాలుగు గంటల సమయంలో మృతి చెందిందన్నారు. భర్త యాదయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ జలంధర్ రెడ్డి తెలిపారు. కాగా మృతురాలికి ఒక పాప, ఒక బాబు సంతానం.


Similar News