తిరుపతిలో టీడీపీ నేత దారుణ హత్య

చిల్లకూరు మండలం నాంచారంపేటలో మల్లారపు హరిప్రసాద్ (20) తన ఇంట్లోనే హత్య చేయబడ్డాడు. రాజకీయ కక్షలతో ప్రత్యేర్థులు హరిప్రసాద్ నిద్రిస్తుండగా.. పెట్రోల్ పోసి నిప్పంటించారు.

Update: 2024-10-22 03:24 GMT

దిశ, వెబ్ డెస్క్: తిరుపతి జిల్లాలో టీడీపీ నేత దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. చిల్లకూరు మండలం నాంచారంపేటలో మల్లారపు హరిప్రసాద్ (20) తన ఇంట్లోనే హత్య చేయబడ్డాడు. రాజకీయ కక్షలతో ప్రత్యేర్థులు హరిప్రసాద్ నిద్రిస్తుండగా.. పెట్రోల్ పోసి నిప్పంటించారు. మంటల్లో కాలిపోతూ.. కాపాడండి అని అరుస్తూనే హరిప్రసాద్ మృతి చెందాడు. చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకునేలోపే నిందితులు పరారయ్యారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. హరిప్రసాద్ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. 


Similar News