Suicide: రంగారెడ్డి జిల్లాలో దారుణం.. బిల్డింగ్‌ పైనుంచి దూకి తల్లీ, కూతురు ఆత్మహత్య

తల్లీ, కూతురు ఆత్మహత్యకు పాల్పడిన హృదయ విదారక ఘటన రంగారెడ్డి జిల్లాలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది.

Update: 2024-09-30 02:52 GMT

దిశ, వెబ్‌డెస్క్: తల్లీ, కూతురు ఆత్మహత్యకు పాల్పడిన హృదయ విదారక ఘటన రంగారెడ్డి జిల్లా (Rangareddy District)లో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నార్సింగి (Narsingi)లోని మైహోం అవతార్ అపార్ట్‌మెంట్‌ (My Home Avatar Apartments)లో భీమవరం (Bheemavaram) ప్రాంతానికి చెందిన మానస (30), తన భర్త, కుమార్తె క‌ృషి (3)‌తో కలిసి నివాసం ఉంటుంది. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి తల్లీ, కూతురు అపార్ట్‌మెంట్‌లోని 18వ అంతస్థు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో వారు తీవ్ర గాయాలతో స్పాట్‌లో ప్రాణాలు కోల్పోయారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే, భర్త సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అని, అనారోగ్యం కారణంగానే మానస ఆత్మహతకు పాల్పడి ఉండవచ్చని నార్సింగి ఇన్‌స్పెక్టర్ హరికృష్ణా రెడ్డి తెలిపారు. మృతురాలు గత కొన్నాళ్ల నుంచి తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతోందని ఆమె సోదరుడు కూడా వెల్లడించారు.    


Similar News