యూపీ గ్యాంగ్ స్టర్ హత్య కేసులో సంచలన విషయాలు..
యూపీలో సంచలనం సృష్టించిన గ్యాంగ్ స్టర్ సంజీవ్ జీవా హత్య కేసులో పోలీసుల విచారణ వేగంగా కొనసాగుతోంది.
దిశ, డైనమిక్ బ్యూరో: యూపీలో సంచలనం సృష్టించిన గ్యాంగ్ స్టర్ సంజీవ్ జీవా హత్య కేసులో పోలీసుల విచారణ వేగంగా కొనసాగుతోంది. ఈ విచారణలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. నిజానికి తాను హత్య చేయబోయే వ్యక్తి ఎవరో తెలియకుండానే నిందితుడు విజయ్ యాదవ్ దారణంగా జీవాను హతమార్చినట్లు పోలీసులు తేల్చారు.
మొత్తం రూ. 20 లక్షలకు నిందితుడు విజయ్ డీల్ కుదుర్చుకున్నాడని అడ్వాన్స్గా రూ.5 వేలు మాత్రమే తీసుకుని ఈ దారుణానికి ఒడిగట్టినట్లు విచారణలో పోలీసులు తేల్చారు. కాగా, ఈ నెల 7వ తేదీన ఓ కేసు విచారణ నిమిత్తం లక్నో కోర్టు వచ్చిన గ్యాంగ్ స్టర్ జీవాను అందరూ చూస్తుండగానే విజయ్ తుపాకితో కాల్చి చంపేశాడు. ఈ కాల్పుల్లో ఓ పోలీస్తో పాటు బాలిక గాయపడింది.