260 కేజీల నకిలీ టీ పౌడర్ పట్టివేత
వాహనాలను తనిఖీ చేస్తుండగా కల్తీ టీ పొడి పట్టుపడిన ఘటన కుల్కచర్ల మండల కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది.
దిశ, కుల్కచర్ల : వాహనాలను తనిఖీ చేస్తుండగా కల్తీ టీ పొడి పట్టుపడిన ఘటన కుల్కచర్ల మండల కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది. కుల్కచర్ల ఎస్ఐ అన్వేష్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం...కుల్కచర్లలో వాహనాలను తనిఖీ చేస్తుండగా బైక్ పై వెళ్తున్న ఓ వ్యక్తి వద్ద నిండుగా ఉన్న రెండు బ్యాగ్ లు కనిపించడంతో అనుమానంతో పరిశీలించగా గండేడ్ మండల కేంద్రానికి చెందిన సురేష్ అందులో 60 కిలోల కల్తీ టీ పొడిని కుల్కచర్లలో విక్రయానికి తీసుకువస్తున్నట్లు తెలిపాడు.
ఇతనికి నగరానికి చెందిన వెంకటప్రసాద్ టీ పొడిని సరఫరా చేస్తున్నాడని చెప్పడంతో అప్రమత్తమైన పోలీసులు అక్కడ కూడా తనిఖీలు నిర్వహించడంతో అతని వద్ద 2 క్వింటాళ్ల టీ పొడి లభించింది. దాంతో టీ పౌడర్ ను, ఒక బైకును సీజ్ చేశామని ఎస్ఐ తెలిపారు. ఈ మేరకు ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.