Road Accident:ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. పలువురికి గాయాలు
ధర్మవరం టౌన్ నుంచి బత్తలపల్లి వైపునకు ప్రయాణించే ఒక ఆటోను ధర్మవరం టౌన్ మార్కెట్ యార్డ్ వద్ద గల కరెంట్ సబ్ స్టేషన్ వద్ద
దిశ ప్రతినిధి,ధర్మవరం: ధర్మవరం టౌన్ నుంచి బత్తలపల్లి వైపునకు ప్రయాణించే ఒక ఆటోను ధర్మవరం టౌన్ మార్కెట్ యార్డ్ వద్ద గల కరెంట్ సబ్ స్టేషన్ వద్ద, ధర్మవరం నుంచి బత్తలపల్లి వైపునకు వెళ్లే పుట్టపర్తి డిపోకు చెందిన ఆర్టీసి బస్సు ఆటోను వెనుక వైపున ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న శ్రీదేవి మరియు ఓబులప్ప, గౌస్ పీరాలకు స్వల్ప గాయాలు అయ్యాయి. వెంటనే స్థానికులు వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స చేస్తున్నారు. ఈ ఘటనపై టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.